20.7 C
Hyderabad
Friday, February 20, 2026
spot_img

అమరావతి నిర్మాణంలో కీలక ఘట్టం

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి కీలక ఘట్టం ముగిసింది. 16 వేల కోట్లు రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకుతో పాటు ఏడీ బ్యాంకు ముందుకొచ్చాయి. ఈ మేరకు రెండు సంస్థలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. ఢిల్లీలో జరిగిన సమావేశంలో బ్యాంకు ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర అధికారులు సుమారు 8 గంటల పాటు చర్చించారు. అనంతరం అవగాహన ఒప్పంద పత్రాలు రూపొందించారు. దీంతో రాజధాని రుణ ఒప్పందంలో పురోగతి లభించింది.

ఈ ఒప్పందానికి డిసెంబర్‌లో జరిగే బోర్డు సమావేశంలో ప్రపంచ బ్యాంకు ఆమోద ముద్ర వేయనుంది. అనంతరం ఒప్పంద ప్రతాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, బ్యాంకు ప్రతినిథులు సంతకాలు చేయనున్నారు. ఆ తర్వాత 16 వేల కోట్ల రుణాల విడుదల ప్రక్రియ ప్రారంభంకానుంది. ప్రపంచ బ్యాకు, ఏడీబీ చెరో 8 వేల కోట్ల రుణాలను ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి అందజేయనున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్