జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు భారీ ఊరట లభించింది. భూ కుంభకోణం కేసులో అరెస్టైన ఆయనకు జార్ఖండ్ హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దీంతో రాంచీలోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయన హైకోర్టు తీర్పుతో ఐదు నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు.
జార్ఖండ్ ముఖ్యంమత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ను భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ జనవరి 31న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సొరేన్ సమాధానం దాట వేస్తున్న క్రమంలో మనీలాండరింగ్ నియంత్రణ చట్టం కింద ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న హేమంత్ సోరెన్. దాదాపు ఐదు నెలల తర్వాత ఇప్పుడు బెయిల్పై బయటకు రాబోతున్నారు.హేమంత్ సోరెన్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాంచీలోని సోరెన్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. సోరెన్ అభిమానులు ఆయన నివాసం వద్ద స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు.