శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ఎయిర్పోర్టులో చొరబడిన చిరుతను బంధించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. చిరుత కోసం ప్రత్యేక బృందాలు 4 రోజులుగా శ్రమిస్తున్నాయి. బోన్ వరకు వచ్చిన చిరుత చిక్కకుండా వెళ్లిపోతుంది. చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు చిక్కాయి. మేకను ఎరగా వేసినా… చిరుత బోనులోకి రావడం లేదు. ఒకే ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు.


