23.7 C
Hyderabad
Friday, October 24, 2025
spot_img

విద్యార్థులపై దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని ఆగ్రా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్​ బస్సు కోసం రోడ్డు పక్కన నిలుచొని వేచి చూస్తున్న ​ విద్యార్థులను.. అతివేగంతో వస్తున్న ఓ కారు ఢీకొట్టగా ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. వెంటనే చిన్నారులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం దౌకి పోలీస్​ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం జరిగింది. బాద్యతారాహిత్యంగా చిన్నారులను కారు ఢీకొన్న ఘటనపై గ్రామస్థులు ఆగ్రహించారు. ఫతేహాబాద్- ఆగ్రా రహదారిని దిగ్బంధించి చిన్నారుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. గాయాల పాలైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. నిర్లక్ష్యంగా ఈ దారుణానికి ఒడిగట్టిన కారు డ్రైవర్ ను శిక్షించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచి పోవడంతో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు… కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గురిచేసిన కారును స్వాధీనం చేసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్