బీఆర్ఎస్ పార్టీలో తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) తెలిపారు. కేవలం మాటలే చెప్పే కేసీఆర్ ను గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారం ఉందికదా అని విర్రవీగే ప్రజాప్రతినిధుల సమయం అయిపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరినీ కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని ఆయన ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో బానిసలుగా బతుకుతున్న ప్రజాప్రతినిధులు బయటకు రావాలని.. అందరం కలిసి పోరాటం చేద్దామని ఆయన ఆహ్వానం పలికారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పొంగులేటి ఓపెన్ ఛాలెంజ్
0
518
Previous article
Next article
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


