ఈప్యాక్ డ్యుర‌బుల్‌తో హైసెన్స్ ఒప్పందం

హైద‌రాబాద్‌, 25 అక్టోబర్ 2024: ప్రముఖ ఒప్పంద త‌యారీదారులైన ఈప్యాక్‌(EPACK) డ్యుర‌బుల్‌తో హైసెన్స్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలలో ప్ర‌పంచ వ్యాప్తంగా పేరున్న హైసెన్స్(Hisense) త‌న గృహోపకరణాలు, ఎయిర్ కండిషనర్ల మార్కెట్ స్వ‌రూపాన్ని మార్చేందుకు ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు. ఒప్పందంలో భాగంగా అధునాత‌న‌మైన హైసెన్స్ ఎయిర్ కండీష‌న‌ర్లు, ఇత‌ర గృహోప‌క‌ర‌ణాల‌ను ఈప్యాక్ సంస్థ ఉత్ప‌త్తి చేయ‌నుంది. మేకిన్ ఇండియా నినాదం ద్వారా స్థానిక ఉత్పత్తుల తయారీని పెంచ‌డంతోపాటు హైసెన్స్ తాజా సాంకేతికంగా ఉన్నతమైన, స్మార్ట్ , ప్రీమియం-నాణ్యత గల గృహోపకరణాలను భారత మార్కెట్‌కు పరిచయం చేయ‌నున్నారు. ప్రపంచ స్థాయికి అనుగుణంగా, వచ్చే 5 సంవత్సరాలలో భారతదేశంలో ఎయిర్ కండీషనర్, గృహోపకరణాలలో అత్యుత్త‌మ‌మైన మొద‌టి అయిదు ఉత్ప‌త్తుల‌లో హైసెన్స్ నిల‌వ‌నుంది.

టెక్నాలజీ, డిజైన్, ఉత్పత్తి సామర్థ్యంలో పెట్టుబడి
ఈ ఒప్పందం ద్వారా, ఈప్యాక్ డ్యూరబుల్ లిమిటెడ్, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఇతర చిన్న గృహోపకరణాలతో సహా ఎయిర్ కండిషనర్లు, గృహోపకరణాల తయారీకి పెట్టుబడి పెడుతుంది. అనేక కీలకమైన ఆర్ఏసీ భాగాలు, చిన్న గృహోపకరణాలు, వాషింగ్ మెషీన్‌ల నమూనాలు ఈడీఎల్ యొక్క ప్రస్తుత మౌలిక సదుపాయాలను ఉపయోగించి హైసెన్స్ కోసం తయారు చేయబడతాయి, హైసెన్స్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి, అత్యున్నత నాణ్యత ప్రమాణాలను కొనసాగించ‌డానికి ఇది మ‌రింత ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈప్యాక్ డ్యూరబుల్ ఏపీలోని శ్రీ‌సిటీలో జూన్ 2025నాటికి ప్రారంభించ‌నున్నారు. త‌ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి 1.0 మిలియన్ పెట్టుబడి పెట్ట‌నున్నారు. పర్యావరణ అనుకూలమైన తయారీ ప్రక్రియలను ఇక్క‌డ అమలు చేయనున్నారు.

గ్లోబల్ రీచ్‌ను విస్తరిస్తోంది
ఈప్యాక్ డ్యూరబుల్ సౌకర్యాల వద్ద తయారు చేయబడిన ఉత్పత్తులు భారతీయ మార్కెట్‌కు మాత్రమే కాకుండా కీలకమైన అంతర్జాతీయ వ్యూహాత్మక మార్కెట్‌లకు ఈ ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశాలను కూడా హైసెన్స్ దృష్టి పెట్టింది. గృహోపకరణాలు, ఎయిర్ కండిషనర్ల మార్కెట్‌లో హైసెన్స్‌, ఈప్యాక్ సంస్థ‌లు చేసుకున్న వ్యూహాత్మ‌క ఒప్పందం ద్వారా ఆదాయాన్ని పెంచే అవ‌కాశాలున్నాయి. దీనికితోడు ఈప్యాక్ డ్యూరబుల్ దాని అనుబంధ సంస్థ కోసం వచ్చే 5 సంవత్సరాలలో దాదాపు సుమారు $1 బిలియన్ వెచ్చించ‌నుంది.

Latest Articles

కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్‌ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్