ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఆయన ఢిల్లీకి పయనమయ్యారు. జగన్ వెంట పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వెళ్లారు. ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచకాలను దేశ ప్రజలకు తెలిసేలా ఢిల్లీలో బుధవారం జగన్ ధర్నా నిర్వహిస్తారు. మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న జగన్.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా పలువురి అపాయింట్మెంట్ కోరారు. ఏపీలో శాంతి భద్రతలు గతి తప్పాయని, రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరతారని తెలుస్తోంది.
గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయర్దేరిన జగన్
0
345
Previous article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


