రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో శ్రీ పద్మావతీ గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణం వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా జరిగింది. ఆలయం శాశ్వత చైర్మన్, విశాఖ ఇండస్ట్రీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జేపీరావు దంపతులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో కల్యాణోత్సవం వైభవంగా కొనసాగింది. ఆలయం అర్చకులు దేవాలయ ప్రతిష్ఠ బ్రహ్మోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పద్మావతీ గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర కల్యాణ మహోత్సవాన్ని రెండు గంటల పాటు నిర్వహించారు. గ్రామస్తులు భారీ సంఖ్యలో ఉత్సవంలో పాల్గొన్నారు. హారతి, మంత్రపుష్పం, భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
మూడపల్లిలో శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణం
0
281
Previous article
Next article
Latest Articles
వైసీపీ ఆందోళన నేపథ్యంలో అలిపిరి వద్ద పోలీసుల మోహరింపు
తిరుపతి నగరంలోని అలిపిరి–జూ పార్క్ బైపాస్ రోడ్డులో ఇటీవల అధికారులు తొలగించిన చిరు వ్యాపారుల దుకాణాల అంశం రాజకీయంగా వేడెక్కింది. దుకాణదారులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలిపిరి వద్ద ధర్నాకు పిలుపునివ్వడంతో...
- Advertisement -
- Advertisement -


