వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు ఆరు గంటల కుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆస్పత్రిలోని జనరేటర్ల ద్వారా ఎమర్జెన్సీ వార్డులకు విద్యుత్ను అందించారు. పలు వార్డుల్లో కరెంట్ లేకపోవడంతో రోగులు నానా అవస్ధలు పడ్డారు. ఉక్క పోతకు గురయ్యారు. విద్యుత్ సరఫరా విషయంలో పలుమార్లు ఇదే పరిస్ధితులు తలెత్తడంపై రోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించి ఆస్పత్రిలో నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


