కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం ధాన్యానికే 500 బోనస్పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధికారం వచ్చాక హస్తం పార్టీ మాట మర్చిందని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ ఆరోపిస్తున్నారు. వరి పంటకు 500 బోనస్ అని ఇప్పుడేమో సన్న రకాలకేనని చెబుతోందని విమర్శిస్తున్నారు. కాగా రైతు భరోసాకు సంబంధించి 6వేల కోట్లకు పైగా చెల్లింపులు తమ ప్రభుత్వంలో జరిగాయని మంత్రులు భట్టి, జూపల్లి, పొంగులేటి అన్నారు. కొందరు కావాలని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తు్న్నారని అంటున్నారు.


