27.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

నేడు సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం

    ఏపీ సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నిన్న విరామం ప్రకటించిన జగన్‌.. ఇవాళ మూడు చోట్ల పర్యటించేందుకు సిద్ధమయ్యారు. కూటమి నేతలను టార్గెట్‌ చేస్తూ, చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఐదేళ్లలో తాను చేసిన మంచిని వివరిస్తూ, సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ, మరోవైపై ప్రతిపక్ష కూటమిపై విరుచుకుపడుతూ సీఎం జగన్‌ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇవాళ మూడు నియోజకవ­ర్గాల్లో ప్రచారంలో భాగంగా కాసేపట్లో బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని రేపల్లె కు చేరుకుంటారు. డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని మాచర్లలో ఉన్న శ్రీనివాస్‌ మహల్‌ సెంటర్‌లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో జగన్‌ పాల్గొంటారు. జగన్ కు జనం కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్