బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్రెడ్డి కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొన్నారు. అంతకు ముందు అమిత్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నేతలు వెళ్లారు. దీపాదాస్ మున్షీ, కోమిరెడ్డి వెంకట్ రెడ్డి.. అమిత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అంనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అమిత్ రెడ్డి


