27.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

తెలుగు సినీ పరిశ్రమలోని 24 శాఖలకు చెందిన పలువురికి అవార్డులు

   జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ – 2024 ఈవెంట్‌ హైదరాబాద్‌ హరిహర కళాభవన్‌లో ఘనంగా జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలోని 24 శాఖలకు చెందిన పలువురికి ఆయా కేటగిటిలలో అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో అనేకమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

   ఈ ఈవెంట్లో బింబిసార మూవీకి బెస్ట్ డైరెక్టర్‌గా వశిష్టకు, RRR లోని నాటు నాటు పాటకు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌కు, నటుడు మాణిక్‌కి, కమెడియన్‌గా రచ్చ రవికి, బెస్ట్ సపోర్టింగ్ రోల్‌గా డీజే టిల్లులో మురళీ ధర్ గౌడ్‌కి, మా ఊరి సినిమాకు గాను ఉత్తమ నటీమణిగా నేహా రెడ్డికి, పుష్పలో బెస్ట్ విలన్‌గా అజయ్ ఘోష్‌కి, వీరితో పాటు మరిన్ని కేటగిరీలలో పలువురికి జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ అందిం చారు. టాలీవుడ్‌లో ఇప్పటికే రెండు సార్లు జోష్ టాలెంట్ అవార్డ్స్ ఇచ్చామని సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ చైర్మన్ సంజోష్ తెలిపారు. ఇప్పుడు మూడో సారి ఘనంగా జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ వేడుక జరిగిందన్నారు. కార్యక్రమానికి వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులకు ఆయన ధన్య వాదాలు తెలిపారు. ఇకపై కూడా ప్రతి ఏడాది ఈ అవార్డ్స్‌ను తమ సంస్థ నుంచి అందిస్తామని సంజోష్‌ తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్