29.1 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

పరకాల ఘటనలో గాయపడిన కార్యకర్తలు …

       జై తెలంగాణ అని నినాదం చేస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అని పోలీసులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. పరకాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఆయన పరామ ర్శించారు. ఛలో మేడిగడ్డకు వెళుతున్న సందర్భంగా మార్గమధ్యలో కార్యకర్తలను కేటీఆర్ కలిశారు. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న బీఆర్ఎస్ కార్యకర్తలను ఓదార్చారు. గులాబీ సైనికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీయిచ్చారు. ఏమాత్రం అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. పరకాల ఘటన నేపథ్యంలో పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝాతో ఫోన్ లో మాట్లాడారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, అటు వంటి వారిపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. న్యాయస్థానాలు, మానవహక్కుల సంఘాలను ఆశ్రయి స్తామని వెల్లడించారు. సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకునేందుకు వెళ్లిన తమ పార్టీ కార్యకర్త లపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని.. థర్డ్‌ డిగ్రీ ఉపయోంచి విచక్షణారహితంగా కొడుతూ చిత్రహింసలు పెట్టారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మేడారం జాతరలో జై తెలంగాణ నినాదాలు చేయడం తప్పా అని ప్రశ్నించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్