ఉత్తరప్రదేశ్ లోని అమేఠీకి చెందిన వృద్ధుడు శత్రుజ్ఙ బరన్ వాల్ ప్రధాని మోదీ పేరును ఏకంగా 9లక్షల 9వేల సార్లు రాశారు. ఆ విధంగా ప్రధాని మోదీపై ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.ఇలా ఆయన మోదీ పేరు రాయడానికి ఒక కారణం ఉందని ఆయన పేర్కొన్నారు.వాస్తవానికి ఆయనకు మోదీ వ్యక్తిత్వం బాగా నచ్చిందని ఈ సందర్భంగా చెప్పారు. తన దృష్టలో దేవుడి తర్వాత మన దేశానికి, సమాజానికి , హైందవ ధర్మానికి ఎంతో సేవ చేశారని ఆయన భావించారు. శతాబ్దాల నుంచి యావన్మంది భారతీయులు ఎదురు చేస్తున్న రామమందిరాన్ని నిర్మించారు. అయోధ్య రాముడి మందిర నిర్మాణానికి విధి ప్రధాని మోదీని ఎంచుకుందని, ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 22 న రామంది రంలో ప్రాణప్రతిష్టలో కూడా పాల్గొంటున్నారు. అందుకే ఆయనను నేను మనస్ఫూర్తిగా అభిమానిస్తున్నా ను…అన్నారు.


