77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రతి ఒక్కరు సంప్రదాయ దుస్తులు ధరించి ఉదయాన్నే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో జాతీయ జెండాను నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించారు. జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకల్లో అల్లు అరవింద్తో పాటు మెగా అభిమానులు, రక్త దాతలు హాజరయ్యారు. అంతేకాక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి రాజు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ఈవీసీ శేఖర్, ఆర్. స్వామినాయుడు కూడా పాల్గొన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ఉదయం ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలందరికీ, మెగా అభిమానులకు, ఆత్మీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.