29 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

యూపీ హాత్రాస్‌లో తొక్కిసలాట 60 మంది మృతి

   ఉత్తరప్రదేశ్‌‌లో దారుణం జరిగింది. హత్రాస్‌లోని రతీభాన్‌పూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 100 మందికి పైగా భక్తులు మరణించారు. మరో వందమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. క్షతగాత్రులను ఎటాహ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. రతీభాన్‌పూర్‌లో పరమశివుడికి సంబంధించి ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ముగింపు ఉత్సవాలకు ఆయా పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు పోటెత్తారు. ఆ క్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఎటాహ్ జిల్లా ఎస్పీ రాజేశ్ కుమార్ సింగ్ స్పందించారు. హత్రాస్ జిల్లాలోని రతీభాన్‌పూర్ గ్రామంలో శివుడి ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ఘటనలో 100 మందికి పైగా భక్తులు మృతి చెందారని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా హత్రాస్ ఘటనపై లోక్ సభలో ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్