30.2 C
Hyderabad
Monday, June 2, 2025
spot_img

రైతులను మోసగిస్తున్న “420” మన ముఖ్యమంత్రి కేసీఆర్: షర్మిల

Y.S. Sharmila | రైతులను మోసగిస్తున్న “420” మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని విరుచుకుపడ్డారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై.ఎస్.షర్మిల. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి ఎకరాకు పది రోజుల్లో పరిహారం ఇస్తామని కమ్మటి మాటలు పలికిన దొర గారు ఇప్పటివరకు రూపాయి విదల్చలేదని ట్విట్టర్ లో తెలిపారు. కేసీఆర్ బుద్ధి తేనెపూసిన కత్తి అని మరోసారి తేలిపోయిందని పేర్కొన్నారు. తొలుత 2.28లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని లెక్కలుగట్టి… చివరకు 1.51లక్షల ఎకరాల్లో మాత్రమేనని తేల్చి రైతుల నోట్లో మట్టి కొట్టాడని మండిపడ్డారు. అన్నదాతలను ఆదుకుందామన్న సోయి లేదు కానీ… మాది కిసాన్ సర్కారు అని పక్క రాష్ట్రాల్లో దొంగ ప్రచారం చేసుకోవడం మాత్రం చేతనైతదా అంటూ చురకలు అంటించారు. ఏడాది కింద నష్టపోయిన రైతులకు సైతం కేసిఆర్ పరిహారం ఎగ్గొట్టిండని మండిపడ్డారు. ఇప్పుడు కూడా పైసా ఇవ్వకుండా నాన్చుతుండని… రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పి, నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10వేలు కాకుండా వరి పంటకు రూ.25వేలు, మిర్చి, మొక్కజొన్న పంటకు రూ.50వేలు, మామిడికి రూ.75 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని షర్మిల పేర్కొన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్