25.3 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

కేరళలో పెను విషాదం.. బోటు బోల్తా పడి 20మంది జలసమాధి

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కేరళలో పెను విషాదం చోటుచేసుకుంది. మలప్పురం జిల్లా తువల్‌తీరం బీచ్ సమీపంలో 30మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఆదివారం రాత్రి 7.30గంటల సమయంలో జరిగిన ఘటనలో 20మంది జలసమాధి అయ్యారు. ఈ దుర్ఘటనపై ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.

మృతుల్లో మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వేసవి సెలవులు నేపథ్యంలో సరదాగా బోటింగ్ కు వచ్చి ఇలా ప్రాణాలు కోల్పోయారు. పడవ బోల్తా పడడానికి కారణం తెలియరాలేదని మంత్రి అబ్దు రహిమాన్ తెలిపారు. జలసమాధి అయిన వారిలో చాలా మంది పడవ అడుగు భాగంలో చిక్కుకుపోయారని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్