Ganjaiseize | సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఇక్రిసాట్ వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు ఎస్ఓటీ రామచంద్రపురం పోలీసులు. ఈ తనిఖీల్లో రెండు కార్లలో తరలిస్తున్న 190 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు రూ. 48 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎనిమిది మంది నిందితుల్లో నలుగురు పరారీ అయ్యారని తెలిపారు. మిగితా నలుగురు నిందితుల వద్ద నుండి 8 సెల్ ఫోన్లను సీజ్ చేశామని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేపడుతామని ఎస్ఓటీ పోలీసులు తెలిపారు.