Hydarabad | సికింద్రాబాద్ చింతబావి బస్తీలో 150 మందికి అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీటితో బస్తీ వాసులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వీరందరికి వాంతులు, విరేచనాలు కావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలుషిత నీటిలో ఏం కలవడం వల్ల వీరంతా అనారోగ్యం బారిన పడ్డారు అనేది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.