స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పది ఫలితాల్లో 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. బాలురు 69.27% , బాలికలు 75.38% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. బాలురు కంటే బాలికలు 6 శాతం ఎక్కువగా పాస్ పర్సెంటేజీ ఉందని బొత్స వెల్లడించారు. ఫలితాలు చూడటానికి https://results.bse.ap.gov.in/ లింక్ ని క్లిక్ చేయండి.