స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి దర్శనానికి 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నిన్న 81,183 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 33,990 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.