Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనానికి మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10గంటల సమయం పడుతుంది. సోమవారం శ్రీవారిని 67,828 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 28,621 మంది తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.14 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు వెల్లడించారు.


