Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

సమతామూర్తి చిట్ ఫండ్స్ పేర కేటుగాళ్ల మోసం

         సమతా మూర్తి.. ఘనమైన పేరుతో చిట్ ఫండ్స్ ప్రారంభించారు. చిట్టీల పేరుతో అమాయకులను మోసం చేస్తు న్నారు కేటుగాళ్లు.. రిజిస్ట్రేషన్ చేయించకుండానే చిట్ ఫండ్స్ కంపెనీలు పెట్టి.. తక్కువ డబ్బులు కడితే ఎక్కువ రిటర్న్ లు వస్తాయని ఆశచూపి, చిట్టీలు వేయించుకుని లక్షల్లో వసూలు చేసి జెండా ఎత్తేస్తున్నారు.. సమతా మూర్తి చిట్ ఫండ్స్ పేరుతో అమాయకులను 5 కోట్ల రూపాయల మేరకు ముంచేసిన ముగ్గురిని అరెస్ట్ చేశారు మాదాపూర్ పోలీసులు.

సమతా మూర్తి అనగానే ముచ్చింతర్ లో రామానుజ విగ్రహం గుర్తుకు వస్తుంది. చిన జీయర్ స్వామి గుర్తుకువస్తారు. ఆ పేరును వాడుకుంటే.. ప్రజల్లో నమ్మకం పెరుగుతుందనే కుట్ర పూరితమైన ఆలోచనతోనే.. సమతామూర్తి చిట్ ఫండ్స్ ప్రారంభించారు… చినజీయర్ స్వామితో సంబంధాలు ఉన్నట్లు ప్రచారం చేసుకున్నారు. ….. తక్కువ డబ్బులు కట్టినా ఎక్కువ రిటర్న్స్ వస్తాయని సామాన్య జనాలను నమ్మించారు.. ఆరు నెలల పాటు చిట్ ఫండ్స్ నడిపించి 5 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి.. కంపెనీ మూసేశారు.. మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబో దిబో మంటూ.. మాదాపూర్ పీఎస్ తో పాటు సైబరాబాద్ సీపీ కి కంప్లెయింట్ చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.

    ముగ్గురు మోసగాళ్లు శ్రీనివాస్, రాకేష్, గణేశ్ లు డైరెక్టర్లుగా సమతామూర్తి పేరుతో చిట్ ఫండ్స్ కంపెనీని ఆరు నెలల క్రితం ప్రారంభించారన్నారు డీసీపీ వినీత్.. మాదాపూర్, కూకట్ పల్లి, ఎల్బీనగర్ లో బ్రాంచీలు పెట్టి 120 మంది బాధితుల నుంచి 5 కోట్ల రూపాయల మేరకు వసూలు చేశారన్నారు.. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు డైరెక్టర్లను అరెస్ట్ చేశామని.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు.. అమాయకులకు డబ్బుల ఆశ చూపి మోసాలు చేస్తున్నారన్నారు.. నెలవారీగా డబ్బులు ఇచ్చే స్కీమ్స్ ఉన్నాయని చెప్పి ఖాతాదారులను నమ్మించి మోసం చేశారన్నారు.సమతామూర్తి పేరు పెట్టి చిన్నజీయర్  స్వామి ఫొటోలను పోస్టర్స్ లో వేసి ఆయన పేరు కూడా వాడుకు న్నారని తెలిపారు డీసీపీ.. ఈ మధ్య చిట్ ఫండ్ మోసాలు పెరిగాయని.. మాదాపూర్ జోన్ లో.. మరో ఆరు కేసులు నమోదయ్యాయని తెలిపారు.. అమాయకుల ఆర్థిక అవసరాలను ఆసరగా చేసుకుని చిట్ ఫండ్స్ ద్వారా మోసాలు చేస్తున్నారన్నారు. తెలిసిన పరిచయస్థుల ద్వారా ఆన్లైన్ ద్వారా ఖాతాదారులను పెంచుకుంటున్నారన్నారు.రిజిస్టర్
చేయించుకోకుండా చిట్ ఫండ్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డీసీపీ.

     సమతామూర్తి చిట్ ఫండ్స్ అనగానే.. చినజీయర్ స్వామికి సంబంధించిన సంస్థ అనుకొని చిట్టీలు కట్టామని చెప్పారు బాధితులు.. లక్షల రూపాయలు తమ వద్ద నుంచి తీసుకుని పేమెంట్ రిటర్న్ చేయమని అడిగితే.. ఫెస్టివల్స్, ఎలక్షన్స్ అంటూ డబ్బులు ఎగ్గొట్టారన్నారు.. తమ డబ్బులు తమకు తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరారు బాధితులు. అత్యాశకుపోయి ఇలాంటి మోసగాళ్ల వలలో పడకుండా….జాగ్రత్త వహించాలని ప్రజలను కోరారు నిందితుల నుంచి డబ్బులు రికవరీ చేసి బాధితులకు ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్