33.9 C
Hyderabad
Thursday, March 5, 2026
spot_img

విశాఖ తూర్పు నియోజకవర్గంలో శంఖారావం సభ

     వైసీపీ పాలనలో విశాఖను గంజాయి క్యాపిటల్‌గా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పులమయం చేసిందని మండిపడ్డారు. విశాఖ నగరంలోని తూర్పు నియోజ కవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. విశాఖను విషాదపట్నంగా మార్చేశారు. రెండు నెలల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కును అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వే జోన్‌, విశాఖకు మెట్రో ప్రాజెక్టు హామీలను జగన్‌ నెర వేర్చలేదని విమర్శించారు. చంద్రబాబు సూపర్‌-6 పేరుతో హామీలను ప్రకటించారని చెప్పారు. ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఏటా డీఎస్సీ ప్రకటిస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్