పశ్చిమగోదావరిజిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆచంట నియోజకవర్గం రా కదలి రా టీడీపీ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో స్టేజ్పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎన్టీఆర్ అభిమానులను, టీడీపీ వాలంటీర్లు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ వాలంటీర్ల మధ్య వాగ్వాదం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో సీఎం సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు.


