Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

మురుగులో మునకలు వేస్తున్న గ్రేటర్ వరంగల్

      అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ, ఎన్నో కాలనీల్లో మురుగు కాల్వలు లేని వైనం, ఇళ్ల మధ్యనే నిలుస్తున్న వృథా నీరు, మురికికూపాలను తలపిస్తున్న కాలనీలు… ఈ నగరం స్మార్ట్ సిటీ కాదు స్లం సిటీ అని నగర ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వరంగల్ నగరం అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరీ ఏమిటో మరి..? ఇక్కడి సమస్యల పరిష్కారానికి సర్కారు పెద్దలు ఏం చర్యలు తీసుకుంటారో.. అని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు.

        ఎంతో ప్రాచీన ఘన చరిత్ర వున్న వరంగల్ ఇప్పుడు పారిశుద్ధ్యలోపంతో కొట్టుమిట్టాడుతోంది. చాలాచోట్ల డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నం, ఎన్నోచోట్ల అసులు మురుగు కాల్వలే లేని వైనం నగరంలో కనిపిస్తోంది. కాలనీలన్నీ మురికి కూపాల ను తలపిస్తున్నాయి. నగరం నడిబొడ్డున, ఇళ్ల చుట్టూ బురద నీరు వరదలా ప్రవహిస్తోంది. ఇది గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ బ్యాంక్ కాలనీ సమీపంలోని సాయి శివాని కాలేజ్ ప్రాంతం. గోపాలపూర్ కల్లుమండువ జంక్షన్ నుంచి భీమా రం వెళ్లే మార్గంలో ఈ ప్రాంతం నెలకొని వుంది. ఇక్కడ సరైన మురుగుకాల్వలు లేవు. దీంతో పైనుంచి వచ్చే మురుగు నీరు రోడ్డు మీద ప్రవహించి, ఇక్కడి ఓపెన్ ప్లాట్లలోకి చేరుకుంటోంది. నీరువెళ్లేందుకు కనెక్టివిటీ లేదు. నీళ్లన్నీ అక్కడే నిల్వ ఉండి చిన్నపాటి కుంట ఏర్పడింది. అదికాస్త పందులు, దోమలకు ఆవాసంగా మారింది. దీంతో, ఆ చుట్టు పక్కల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

సిటీ డ్రైనేజీ సిస్టంకు సంబంధించిన ప్రత్యేకంగా ఎలాంటి మ్యాప్ లేదు. వరద, మురుగునీటి ప్రవాహానికి ఒకే కాల్వలు దిక్కవుతున్నాయి. ఏటా రూపొందించాల్సిన సిటీ శానిటేషన్ ప్లాన్ ను ఎవరూ పట్టించుకోకపోవడంలేదు. ఈ కారణాల వల్ల ఈ దుస్థితి తలెత్తుతున్నట్టు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ హయాంలో, అప్పటి సీఎం కేసీఆర్ ఈ నగరాన్ని డల్లాస్ మాదిరి అభివృద్ధి చేస్తామని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ మాటలు నీటి మీద మూటలయ్యాయి. బీఆర్ఎస్ సర్కారు అధికారం కోల్పోయి ప్రతిపక్షంగా మారింది.

       రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న గ్రేటర్ వరంగల్ నగరం 407 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా.. దాదాపు 2.25 లక్షల ఇళ్లు, సుమారు 11 లక్షల జనాభా నివసిస్తోంది. సిటీలో మొత్తంగా 1,450 వర కు కాలనీలు ఉండగా.. అందులో సగం కాలనీల్లో మురుగునీటి సరఫరా వ్యవస్థ సరిగా లేదనే విమర్శలు వినిపిస్తున్నా యి. అధికారుల లెక్కల ప్రకారం నగరంలో 53.3 కిలోమీటర్ల ప్రధాన నాలాలు, 1,433.02 కి.మీ డ్రైన్లు, 151 కిలోమీటర్ల ఒక మీటర్ నాలాలు, 882.21 కిలోమీటర్ల మేర పక్కా డ్రైన్లు, 344.27 కిలోమీటర్ల మేర కచ్చా డ్రైన్లు ఉన్నాయి. ఇంతపెద్ద మొత్తంలో డ్రైనేజీ సిస్టం ఉందని ఆఫీసర్లు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వందల కాలనీల్లో డ్రైన్లు కనిపించకపోవడం గమనార్హం. దీంతో ఆఫీసర్ల లెక్కలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ప్రస్తుతం డ్రైన్లు ఉన్న కాలనీల్లోనూ
ప్రణాళిక లేకుండానే నిర్మించారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి రోడ్లు, డ్రైన్లను వేర్వేరుగా చూడకుండా ఒకేసారి వేయా ల్సి ఉంటుంది. అయితే, లీడర్లు, ఆఫీసర్ల ప్లానింగ్ లోపం కారణంగా కొన్ని చోట్ల రోడ్లు వేయకుండా డ్రైన్లు నిర్మించి వదిలేశారు. దీంతో రోడ్ల కంటే డ్రైన్లు ఎత్తుగా మారి వృథా నీరు కాల్వలోకి వెళ్లకుండా రోడ్లపైనే నిలిచి ఉంటోంది.

        నగరంలో కొన్నేండ్ల కిందట నిర్మించిన డ్రైనేజీ సిస్టమే అందుబాటులో ఉంది. అప్పటి అవసరాల మేరకు రోడ్లు, డ్రైన్లు నిర్మించగా.. ఆ తరువాత పెరుగుతున్న కాలనీలకు అనుగుణంగా లీడర్లు, ఆఫీసర్లు రోడ్లు, డ్రైన్లు వేసుకుంటూ వచ్చారు. అయితే, ఒక కాల్వను, మరో కాల్వను కలిపే ఇంటర్ కనెక్టివిటీని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. దీంతో పాటు నగర ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కాల్వల లోతు కూడా లేవు. దీంతో వర్షాలు పడినప్పుడు మురుగునీటి సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. కాలనీల్లోని ఓపెన్ ప్లాట్లన్నీ మురుగు నీటి కూపంగా మారుతున్నాయి. సిటీలో అధికారికం గా గుర్తించిన స్లమ్ ఏరియాలు 183 ఉండగా… మురుగునీటి కుంటలు, పందులు, కుక్కలు, దోమల సంచారంతో వందల కాలనీలు స్లమ్ ఏరియాలుగా దర్శనమిస్తున్నాయి. వర్షాలు పడినప్పుడు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంటోంద ని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

        నగరంలోని డ్రైన్లు, పూడికతీత, టాయిలెట్స్ తదితర అవసరాలకు సంబంధించి ప్రతి సంవత్సరం బల్దియా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ‘సిటీ శానిటేషన్ ప్లాన్’ తయారు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత అవసరాన్ని బట్టి కొత్త టాయిలెట్స్ నిర్మించడం, డ్రైన్లు కట్టడం, డీ సిల్టేషన్ చేపట్టడం లాంటి చర్యలు చేపట్టాలి. నగరంలో చివరి సారిగా 2013లో సిటీ శానిటేషన్ ప్లాన్ తయారు చేసిన అధికారులు.. ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదు. దీంతో సిటీలో శానిటేషన్ సమస్యలతో జనాలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అంతేగాకుండా ఏటా రెండే కోట్ల రూపాయలతో నాలాల్లో డీసిల్టేషన్ చేపడుతున్నప్పటికీ ఫలితం లేకుండాపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం తప్పనిసరి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, ఇక్కడి పాలకులు వరంగల్ నగరంలో నెలకొన్న సమస్యలపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్