35.4 C
Hyderabad
Thursday, March 5, 2026
spot_img

ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబుపై చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సీఐడీ

          ఫైబర్‌నెట్‌ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీఐడీ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఈ చార్జ్‌షీట్‌‌లో ఏ1గా చంద్రబాబు, ఏ2గా వేమూరి హరికృష్ణ, ఏ3గా కోగంటి సాంబ శివ రావును పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగినట్లు గుర్తించా మని సీఐడీ గతంలోనే తెలిపింది. మొత్తం 2వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో 333 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇందులో కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. ఫైబర్‌‌నెట్‌ ప్రాజెక్టులో భాగంగా టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేష్‌కు సన్నిహితుడైన వేమూరి హరి కృష్ణకు చెందిన ‘టెరా సాఫ్ట్‌’ కంపెనీకి అక్రమంగా టెండర్లు కట్టబెట్టారనేది ప్రధాన అభియోగం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఇప్పటికే పలు అభియోగాలపై కేసులు నమోదయ్యాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు చేసి, రాజమండ్రి జైలులో 52 రోజుల పాటు ఉంచారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ అరెస్టు వ్యవహారం సంచలనంగా మారాగా.. తాజాగా మరో కేసులో చంద్రబాబు నాయుడిని ఏ1గా పేర్కొంటూ చార్జ్‌షీట్ దాఖ లు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్