ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని హెచ్ఎండీఏ ఆమోదించింది. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటు కు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ మంగళవారం నాడు రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆ వెంటనే గద్దర్ విగ్రహం ఏర్పాటు కోసం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఒక తీర్మానాన్ని చేసింది. దానికి హైదరాబాద్ మెట్రోపా లిటన్ డెవలప్మెంట్ అథార్టీ ఆమోదించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం అవసరమైన స్థలాన్ని కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వ స్థలం కేటాయించటం పట్ల గద్దర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.