28.4 C
Hyderabad
Saturday, July 12, 2025
spot_img

పెరిగిపోతున్న సైబర్‌ మోసాలు …. కేంద్రం కీలక నిర్ణయం

       మధ్య కాలంలో మోసాలు పెరిగి పోతున్నాయి. మొబైల్‌ల ద్వారా కాల్స్‌ చేస్తూ అమాయకులను మోసగిస్తున్నారు. ఒకరి పేరుపై ఎన్నో సిమ్‌ కార్డులను తీసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇలాంటి వాటిపై నిఘా పెట్టింది. డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1.4 లక్షల మొబైల్ నంబర్లను బ్లాక్ చేసింది. అధికారిక నివేదికలు విడుదల ప్రకారం ఈ మొబైల్ నంబర్లు ఆర్థిక మోసంతో ముడిపడి ఉన్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషి అధ్యక్షతన శుక్రవారం ఆర్థిక సేవల రంగంలో సైబర్ భద్రత పై సమావేశం జరిగింది. ఇది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ ఇంటిగ్రేషన్ ద్వారా సివిల్ ఫైనాన్షియల్ సైబర్, సైబర్ ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్లాట్‌ ఫారమ్‌ పై బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆన్‌ బోర్డింగ్‌తో సహా వివిధ సమస్యలను చర్చించింది. CFCFRMS ప్లాట్‌ఫారమ్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ తో అనుసంధా నించబడుతుంది. దీనివల్ల పోలీసులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య మెరుగైన సమన్వయం సాధ్యమవుతుంది. మల్టిపుల్ ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్న 35 లక్షల ప్రైమరీ యూనిట్‌ లను టెలి కమ్యూనికేషన్స్ విభాగం విశ్లేషించిందని ప్రకటన పేర్కొంది. వీటిలో హానికరమైన SMS పంపిన 19,776 సంస్థలు బ్లాక్ లిస్ట్ చేసింది. ఈ విషయంలో 500 మంది కి పైగా అరెస్టులు చేశారు. అలాగే సుమారు 3.08 లక్షల సిమ్‌లు బ్లాక్ చేసింది కేంద్రం. దేశంలో సైబర్ మోసాల కేసులు వేగంగా పెరుగు తున్నాయని, ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు మొబైల్ ఫోన్‌ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని గుర్తించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్