వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై APCC చీఫ్ షర్మిల స్పందించారు. వైవీ సుబ్బారెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నానని చెప్పా రు. జగన్ రెడ్డి అని పిలిస్తే వైసీపీ వాళ్లు ఫీల్ అవుతున్నారని.. జగన్ రెడ్డి అని పిలిస్తే ఇబ్బందిగా ఉంటే జగన్ అన్నా అని పిలుస్తానని చెప్పారు. వైసీపీ చేసిన అభివృద్ధి చూడటానికి తాను సిద్దమని అన్నారు. ప్లేస్ మీరు చెప్పినా సరే.. తాను చెప్పినా సరే అన్నారు. వైసీపీ కట్టిన రాజధాని, పోలవరం ఎక్కడ? అని ప్రశ్నించారు షర్మిల. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల.. పలాస ఆర్టీసీ బస్సు ఎక్కారు. ప్రయాణికులతో మాట్లాడారు.


