గ్రేటర్లో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డి దంపతులు కలిశారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై మోతె శోభన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ప్రస్తుతం శోభన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న శోభన్రెడ్డి హస్తం గూటికి చేరాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈరోజు ముఖ్యమంత్రితో డిప్యూటీ మేయర్ దంపతులు భేటీ అయ్యారు. మరో రెండు రోజుల్లో శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు. తాజాగా ఇప్పుడు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ కలవడం ప్రాధాన్యతన సంతరించుకుంది.


