తెలంగాణలో అధికారం చేపట్టి పట్టుమని నెలరోజులైనా కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సమర శంఖం పూరించింది. ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి ఏంటని ప్రశ్నిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ 420 హామీల పేరుతో ఒక బుక్లెట్ రిలీజ్ చేసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై ఒత్తిడి పెంచుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం బీ ఆర్ఎస్ నేతల విమర్శలకు ధీటుగా స్పందిస్తోంది. పనిలేకే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీని బద్నామ్ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. దీంతో హామీల అమలు సంగతి ఎలా ఉన్నా..పొలిటికల్ రచ్చ మాత్రంతారాస్థాయికి చేరుతోంది.


