స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) గ్రూప్4 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల మార్కుల జాబితాను జిల్లాల వారీగా APPSC అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,11,341 మంది హాజరుకాగా.. 11,574 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ఇప్పుడు మెయిన్స్లో అర్హత సాధించిన వారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను జిల్లాల కలెక్టర్లు చేపడతారు. కాగా రెవెన్యూ శాఖలో మొత్తం 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు ఏప్రిల్ 4న రెండు షిఫ్టుల్లో ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు.