రామ మందిర ప్రారంభోత్సవానికి 7వేల మంది అతిథులను ఆహ్వానించారు. వారిలో 506 మంది అత్యంత ప్రముఖులున్నారు. రామ జన్మభూమి కోసం పోరాటం చేసిన వారినీ ఈ కార్యక్రమానికి పిలిచారు. సాధువులు, పీఠాధిపతులు, రాజకీయ, సినీ, క్రీడాకులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. వీరిలో ఇప్పటికే చాలామంది అయోధ్యకు చేరుకున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్, ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవ ర్నర్ ఆనందీబెన్, శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు మహంత్ నృత్యగోపాల్ దాస్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, స్వామినారాయణ హాజరయ్యారు. ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా, అధిర్ రంజన్ చౌదరి, మన్మో హన్ సింగ్ను ఆహ్వానించినా వారు హాజరు కాలేదు. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి పారిశ్రామికవే త్తలు గౌతమ్ అదానీ, రతన్ టాటా, ముఖేశ్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా..ఎన్. చంద్రశేఖరన్, అనిల్ అగర్వాల్ తదిదరులు పాల్గొన్నారు.
అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సినీ ప్రముఖులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ , ప్రభాస్, మోహన్ లాల్, రజనీకాంత్, అమితాబ్, అనుపమ్ ఖేర్, మాధురీ దీక్షిత్, సంజయ్ లీలా బన్సాలీ, ధనుష్..అక్షయ్ కుమార్, రణ్దీప్ హుడా, రణ్బీర్ కపూర్, అనుష్క శర్మ..కంగనారనౌత్, రిషబ్ శెట్టి, అజయ్ దేవ్గన్, జాకీష్రాఫ్, టైగర్ ష్రాఫ్.. యష్, ఆయుష్మాన్ ఖురానా, ఆలియా భట్, సన్నీడియోల్ వంటి వారికి ఆహ్వానం అందింది. వీరిలో పలువురు ఇప్ప టికే అయోధ్య చేరుకున్నారు . గడ్డకట్టే చలిలోనూ దేశం నలుమూలల నుంచి పలువురు పాదయాత్ర ద్వారా, సైకిళ్లపై, వాహనాలపై అయోధ్యకు చేరుకున్నారు. మతాలకతీతంగానూ పలువురు వచ్చారు.