అయోధ్యలో టీటీడీ అధికారుల బృందం పర్యటిస్తున్నారు. నేడు రామాలయం ట్రస్ట్కు నివేదిక సమర్పించనుంది టీటీడీ బృందం. బాలరాముని దర్శించుకోవడానికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో అయోధ్య రామాలయం ట్రస్టు భక్తులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో రామాలయ ట్రస్ట్ ప్రతినిధులు టీటీడీ సహకారం కోరారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి అయోధ్యకు వెళ్లారు. రామాలయ పరిసర ప్రాంతాలు ప్రాంతాలను పరిశీలించి అనేక అంశాలపై ట్రస్టు సభ్యులతో చర్చించారు. టీటీడీ బృందం పరిశీలించిన అంశాలతో నివేదిక రూపొందించి రామాలయం ట్రస్ట్కు అందజేయనున్నారు.


