తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రత విషయంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆయన సెక్యూరిటీ లో లీక్ రాయుళ్లు ఉన్నారన్న సమాచారం రావడంతో ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో.. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిని మొత్తం మార్చివేయాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి భద్రత అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అది చూసేందుకు సుశిక్షితులైన వాళ్లుంటారు. అదే సమయంలో సీఎంకు సంబంధించిన సమాచారం ఎలాంటిదైనా బయటకు పొక్కకుండా చూస్తుంటారు. కానీ, తెలం గాణ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోందా అంటే అవునన్న సమాధానం వస్తోంది. అనుమానాలు తలెత్తాయి. అంతే.. సీఎం రేవంత్ సెక్యూరిటీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత, అధికారిక సమాచారం బయటకు పొక్కుతోందని ప్రధానంగా ప్రభుత్వం తరఫున రేవంత్ తీసుకునే నిర్ణయాలు మాజీ సీఎం కేసీఆర్ వద్దకు వెళుతున్నా యన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పనిచేసిన సిబ్బంది ఎవరూ రేవంత్ వద్ద ఉండవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సీఎం వద్ద ఉన్న పోలీస్ సెక్యూరిటీని మొత్తం మార్చేసింది.కేవలం పోలీస్ సెక్యూరీటీయే కాదు.. గత ముఖ్యమంత్రి వద్ద పనిచేసిన ఓ ఒక్క అధికారిని, సిబ్బందినీ ప్రస్తుతం రేవంత్ వద్ద పెట్టవద్దని నిర్ణయించినట్లు నిఘా వర్గాల సమాచారం. దీంతో.. ఇప్పుడంతా ఇదే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది.