Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

జూబ్లీహిల్స్ హనీ ట్రాప్‌ ….. ఈజీ మనీ వేటలో దారుణాలు

      పాత కక్షలతో టైం కోసం వేచి చూస్తున్నది ఒకరు.. తన ప్రియురాలికే ఎసరు పెట్టాడన్న కోపంతో మరొకరు.. వాడుకు న్నాం.. ఇక వదలిద్దాం అన్న ఆలోచనతో ఇంకొకరు.. కారణం ఏదైనా క్రైమ్‌ థ్రిల్లర్‌కు ఏ మాత్రం తగ్గని రేంజ్‌లో చేసిన మర్డర్ అది. నిజమే జూబ్లీహిల్స్ హనీ ట్రాప్‌ కేసులో రోజు రోజుకూ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే ఇప్పుడు మహానగరంలో సంచలనం సృష్టిస్తోంది.

       కత్తి పట్టుకున్న వాడు ఏనాటికైనా ఆ కత్తికే బలవుతాడు అన్నట్లుగా.. చెడు సావాసాలు చేసిన వాడు చివరకు వారి చేతిలోనే హతమైన ఘటన ఇది. జూబ్లీహిల్స్‌ హనీ ట్రాప్‌ కేసు గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఇదీ విషయం. అదే వివ రించి చెప్పాలంటే చాలానే ఉంది. అక్రమ సంబంధాలు, ఈజీ మనీ వేటలో పడిన మనిషి ఆలోచనా విధానం ఎలా మారుతుందనే దానికి నిలువెత్తు నిదర్శనం ఈ కేసు. ఇప్పుడు చెప్పుకున్నదంతా ఇతడి గురించే. పేరు సింగోటం రాము. నాగర్‌ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటానికి చెందిన రాము… హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపా రం చేసేవాడు. అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్‌ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండేవాడు. దీనికి తోడు నగర శివార్లలో జువ్వ ఆడేవాడు.ఈ క్రమంలోనే ఎన్నో చెడు అలవాట్లకు బానిసయ్యాడు రాము. ఇటీవలె ఇతడిని    దారుణంగా హత్య చేశారు కొందరు. ఇదే ఇప్పుడు సంచలనం సృష్టించింది. తీగ లాగితే డొంకంతా కదిలిన చందంగా.. ఈ మర్డర్ వెనుకాల పెద్ద కథ దాగుంది. చెప్పాలంటే క్రైమ్‌ థ్రిల్లర్‌ను మించిన స్టోరీ ఉందనే చెప్పాలి.

        జువ్వ ఆడే క్రమంలో రాముకు.. మణికంఠ, వినోద్ అనే ఇద్దరు స్నేహితులయ్యారు. అందరూ ఈ ఆటలో బాగానే సంపాదించారు. అయితే.. మణికంఠ, వినోద్ ఇద్దరూ ఇరవై కోట్ల వరకు సంపాదించగా.. రాము మాత్రం వందకోట్ల వరకు గెల్చుకున్నాడు. ఆటలో ఎవరెంత గెల్చుకున్నారనేది పక్కన పెడితే.. ఎంతో స్నేహంగా మెలిగేవారు ముగ్గురు. ఈ క్రమంలో రాముకు స్థానికంగా ఉన్న మహిళ హిమాంబితో పరిచయం ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా రావులపా లెంకు చెందిన హిమాంబి భర్తను వదిలేసి కూతురుతో హైదరాబాద్‌కు వచ్చి ఉంటోంది. ఈమె పరిచయంతో అప్పుడ ప్పుడు హిమాంబి దగ్గరకు వచ్చిపోతుండేవాడు రాము. అంతేకాదు.. తన స్నేహితులైన మణికంఠ, వినోద్‌ను సైతం తీసుకెళ్లేవాడు. దీంతో అందరూ స్నేహితులయ్యారు. అదే సమయంలో హిమాంబి కూతురు నసీమా, వినోద్ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ, ఈ విషయం బయటకు చెప్పలేదు.

         ఇక, హిమాంబి విషయానికి వస్తే భర్తను వదిలేసి హైదరాబాద్‌ వచ్చేసిన ఈమె..యూసుఫ్‌గూడలోని ఎల్‌ఎన్‌ నగర్‌లో ఓ కానిస్టేబుల్ ఇంట్లో అద్దెకు దిగింది. మెల్లగా పరిచయం పెంచుకొని అతగాడిని లైన్లోకి దింపింది. అంతే.. ఆమే సర్వస్వం అనుకున్నఆ కానిస్టేబుల్‌ భార్యా, పిల్లల్ని సైతం వదులుకున్నాడు. చివరకు తన ఇంటిని ఆమె పేరుపై రాసేశాడు. దీంతో.. అవసరం తీరిపోయాక ఆ కానిస్టేబుల్‌నే పక్కన పడేసింది హిమాంబి. అంతేకాదు..తన కూతురు నసీమాతోపాటు మరి కొందరు అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తూ సంపన్నులను దోచుకోవడం మొదలు పెట్టింది. మరోవైపు…మొదట్లో ఎంతో బాగా ఉన్న ఈ స్నేహితుల మధ్య రాన్రానూ గొడవలు రావడం మొదలయ్యాయి. జువ్వ ఆటలో మణికంఠ ఎక్కువగా డబ్బులు పోగొట్టుకుంటుండడంతో  రామును చూస్తే ఇతడిలో ఈర్ష మొదలైంది. ఈ క్రమంలోనే మణికంఠ, రాము మధ్య మొదలైన వివాదం పెరిగి పెద్దదైంది. కొట్టుకునే వరకు వెళ్లింది.అది కాస్తా మరింత ముదిరి చంపుకునే స్టేజ్‌కు దారితీసింది. ఈ ప్రయత్నంలోనే మణికంఠను దాదాపుగా చంపేసినంత పని చేశాడు రాము.చివరకు తప్పించుకొని పారిపోయాడు మణికంఠ. అప్పట్నుంచి రాముపై కక్ష తీర్చుకునేందుకు  సమయం కోసం వేచి చూస్తున్నాడు మణికంఠ.

     రాముతో అక్రమ సంబంధం పెట్టుకున్న హిమాంబి.. మెల్లగా అతడి దగ్గర్నుంచి డబ్బులు గుంజడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే వేలు, లక్షలు దాటి కోట్ల వరకు అతడి నుంచి రాబట్టుకోవడం మొదలు పెట్టింది. అయితే.. ఈ సమయంలోనే రాము… హిమాంబి కూతురిపైనా కన్నేశాడు. తనతోనూ సంబంధం కావాలంటూ తల్లి హిమాంబి వద్ద చెప్పాడు. మొదట్లో దాటేస్తూ వచ్చిన హిమాంబి రాము నుంచి డబ్బులు గుంజుకోవడంపైనే దృష్టి పెట్టింది. చివరకు అతడ్ని దివాలా తీసి అప్పులు చేసే పరిస్థితికి తీసుకొచ్చింది. అయితే.. ఒత్తిడి ఎక్కువ కావడంతో ఎలాగని ఆలోచిం చడం మొదలు పెట్టింది. అయితే.. నసీమా ఇదే విషయాన్ని తన ప్రియుడు వినోద్‌కు వెల్లడించింది. రాము విషయం తెలియడంతో ఆగ్రహించిన వినోద్ ఏం చేయాలా అని ఆలోచించాడు. విషయాన్ని మరో స్నేహితుడైన మణికంఠ దృష్టి కి తీసుకొచ్చాడు. అటు.. హిమాంబి సైతం ఇక రాము దగ్గర డబ్బులు లేవని గ్రహించింది. తన కూతురు విషయం లో రాముతో ఎదురవుతున్న తలనొప్పి శాశ్వతంగా వదిలించుకునేందుకు వినోద్‌ సాయం కోరింది. అంతే వీరంతా కలిసి పక్కా ప్లాన్ వేశారు.

         ప్లాన్‌లో భాగంగా హనీ ట్రాప్ చేశారు. ఇందులో భాగంగా హిమాంబి రాముకు ఫోన్ చేసింది. నసీమాను సొంతం చేసుకునేందుకు రావాలంటూ పిలిచింది. అంతే ఎక్కడలేని ఉత్సాహంతో వచ్చేశాడు రాము. ఇదే అదనుగా భావించి, హిమాంబి, ఆమె కూతురు కలిసి కత్తితో దాడి చేశారు. ఆ సమయంలోనే మణికంఠ, వినోద్‌తోపాటు మరికొందరు వచ్చి విచక్షణా రహితంగా పొడిచారు. మర్మాంగాలను కోసి మరీ ప్రతీకారం తీర్చుకున్నారు. మర్డర్ అనంతరం మణికంఠ.. రాము బావమరిదికి ఫోన్ చేసి, రామును చంపేశాం. డెడ్‌ బాడీని తీసుకెళ్లండంటూ చెప్పాడు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయి రాంరెడ్డి నగర్ వద్ద వినోద్‌, మరికొందరితో కలిసి టపాసులు కాల్చి మరీ సంబరాలు చేసుకున్నారు. సింగోటం రాము మర్డర్ కేసు విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. హిమాంబిపై గతంలోనూ అనేక కేసులు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే పలుమార్లు వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన ఆమె మరో వ్యక్తి నుంచి మూడు లక్షల వరకు లాగిందని తెలుస్తోంది. అలాగే తన కూతురుని అడ్డుపెట్టుకొని అనేక అక్రమాలకు పాల్ప డిందని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఇప్పటికే ఇన్ని మలుపులు తిరిగిన కేసు రాన్రానూ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్