కేరళ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షకు నిరసనగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆధ్వ ర్యంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టింది. ఆర్థిక పరమైన సహాయం విషయంలో కేంద్రం పక్షపాతం చూపుతోందని కేరళ సీఎం ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తోపాటు జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా, సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి.. సీపీఐ నేత డి. రాజా ఇతరులు పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ఫెడరలిజం పరిరక్షణకే ఈ పోరాటం అని వక్తలు పేర్కొన్నారు.