చండీగఢ్ మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోజ్ శంకర్ ఎన్నికయ్యారు. ఇండియా కూటమికి , ఇది తొలి ఓటమి. ఆమ్ ఆద్మీపార్టీ – కాంగ్రెస్ అలయన్స్ అభ్యర్థి కుల్దీప్ సింగ్ ఓటమి పాలయ్యారు. బీజేపీకి చెందిన మనోజ్ శంకర్ కు 16 ఓట్లు రాగా ఆప్ – కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కుల్దీప్ సింగ్ కు 12 ఓట్లువచ్చాయి. మరో 8 ఓట్లు చెల్ల లేదని ప్రకటించారు. కాగా, బీజేపీ అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటించేందుకే ప్రిసైడింగ్ అధికారి 8 ఓట్లు చెల్లని ఓట్లు అని ఉద్దేశపూర్వకంగా ప్రకటించారని ప్రతిపక్షాల కూటమి ఆరోపించింది. 36 మంది సభ్యులుగల చండీగఢ్ కార్పొరేషన్ లో ఆప్, కాంగ్రెస్ కూటమి బలం 20 కాగా, బీజేపీ బలం 16, శిరోమణి అకాలీదళ్ ఒక స్థానం గెలుచుకుంది. నిజానికి 20 సభ్యుల బలం ఉన్న ఇండియా కూటమి కచ్చితంగా గెలుస్తుందని భావించారు. కానీ 8 ఓట్లు చెల్లని ఓట్లని ప్రిసైడింగ్ అధికారి ప్రకటించడంతో, బీజేపీ అభ్యర్థి మనోజ్ శంకర్ గెలిచారు.