ABVP రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళా కానిస్టేబుల్పై ఆయేషాపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఝాన్సీ జుట్టు లాగిన కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిష నర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీచేశారు. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 55 జారీచేసింది. జీవో రద్దు చేయాలంటూ ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఈ ప్రయత్నంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఝాన్సీ పట్ల దురుసుగా ప్రవర్తించింది కానిస్టేబుల్ ఆయోషా. స్కూటీ వెనకాల కూర్చొన్న ఆమె ఝాన్సీ జట్టు పట్టుకొని లాగడంతో ఝాన్సీకి తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్ అయేషా దురుసుగా ప్రవర్తించిందని విచారణలో తేలడంతో సీపీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.