Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఎన్నికల వేళ ప్రజాక్షేత్రంలోకి గులాబీ బాస్‌

        త్వరలోనే జనం మధ్యకు కేసీఆర్.. అవును.. తెలంగాణ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని సాధ్యమైనంత త్వరగా మరచిపోయి మళ్లీ జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు గులాబీ బాస్. అంతేకాదు…కృష్ణా ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎండగడతూ మరోసారి ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా లోక్‌ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మైలేజ్‌ వస్తుందని లెక్కలేస్తున్నారు. మరి… సార్వత్రిక ఎన్నికల వేళ కేసీఆర్ చేపట్టబో యే ఈ కార్యాచరణ బీఆర్ఎస్‌కు ఎంత మేర మైలేజ్ తీసుకురానుంది..? అసెంబ్లీ ఎన్నికల్లో ఢీలా పడిన కారు…లోక్‌సభ ఎన్నికల్లో వంద స్పీడుతో పరిగెడుతుందా ? దీనిపైనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

       నన్ను.. నా పార్టీని టచ్‌ చేయడం నీతో కాదు.. హేహాహేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకుంది.. ఇలా ఒకటీ రెండు కాదు.. బుల్లెట్‌ లాంటి మాటలతో సీఎం రేవంత్ రెడ్డిపై మాటల తూటాలు పేల్చారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. పదేళ్లుగా ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్న రాష్ట్రాన్ని పరాయివాళ్ల పాలు చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వంపై విరుచు కుపడ్డారాయన. అసలు గులాబీ బాస్ కేసీఆర్.. ఇంతలా ఎందుకు ఫైరయ్యారు..? మాటల తూటాలు ఎందుకు పేల్చా రు.. ఇలాంటి సందేహాలే అందరిలోనూ తలెత్తుతున్నాయి. అందుకు ప్రధాన కారణం కృష్ణా ప్రాజెక్టుల అంశమే. అవును … కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్. ఆ క్రమంలోనే రేవంత్ సర్కారుపై వాగ్బాణాలు సంధించారాయన.

        నిజానికి కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేంద్రం ఆధ్వర్యంలోని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు అప్ప గించే విషయంలో తప్పు మీదంటే మీదంటూ గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోం ది. ఈ క్రమంలోనే మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఇటీవలె వివరణ ఇస్తూ సుదీర్ఘంగా ప్రసం గించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. గత బీఆర్ఎస్ పాలనలోనే కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారని.. అందుకు సంబంధించిన ఫైల్స్‌పై నాటి సీఎం హోదాలో కేసీఆర్ సంతకం సైతం చేశారంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీటి వాటాల విషయం లోనూ అప్పట్లోనే సంతకాలు అయ్యాయని ఈ విషయాలు నాటి మినిట్స్‌లోనే ఉన్నాయంటూ ముఖ్యమంత్రి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశంపైనే గళమెత్తారు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి చెప్పినవన్నీ అసత్యాలేనంటూ తేల్చిచెప్పారు మాజీ మంత్రి హరీష్‌రావు. గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని… కేవలం రెండు నెలల్లోనే ఆ పని కాంగ్రెస్ సర్కారు చేసిందంటూ ఆరోపించారు హరీష్‌ రావు. దీనిపై అసెంబ్లీ వేదికగా తేల్చుకుందామంటూ ముఖ్యమంత్రి సవాలుకు ప్రతిసవాలు చేశారు హరీష్‌రావు.

       ఇలా.. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా పరిస్థితి తయారైన నేప థ్యంలో ఈసారి ఏకంగా గులాబీ బాసే రంగంలోకి దిగారు. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ చెప్పేవన్నీ అసత్యాలేనం టూ చెప్పుకొచ్చారు మాజీ సీఎం కేసీఆర్. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన గులాబీ బాస్‌… సర్కారు వైఖరితో రాష్ట్రం మళ్లీ కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు… తనతోపాటు తన పార్టీపై సీఎం రేవంత్‌ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్ని తప్పుపట్టిన ఆయన… కాంగ్రెస్ సర్కారుపై మాటల తూటాలు పేల్చారు. ఎందరో హేమాహేమీలను చూశానని చెప్పు కొచ్చిన కేసీఆర్… తనను, తన పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం ఇక్కడితేనే ఆగిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత చర్యల కారణంగా కృష్ణా బేసిన్‌లోని దక్షిణ తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వెల్లడించారు మాజీ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తెలంగాణ రైతు వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా తప్పుపట్టిన కేసీఆర్… ఇదే అంశంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. తెలంగాణ భవన్‌లో పార్టీ శ్రేణలుకు సైతం దీనిపై దిశానిర్దేశం చేశారు. గతంలో కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా చివరకు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్వయంగా రంగంలోకి దిగినా తాను మాత్రం వెనక్కు తగ్గని విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు కేసీఆర్. అంతేకాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల తీవ్రంగా నష్టపోయే హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల ప్రజలకు తాగు, సాగు నీరు హక్కుల కోసం పోరాడదామంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత. గతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్య మించిన విషయాన్ని గుర్తు చేసిన మాజీ సీఎం.. అదే మాదిరిగా.. అదే పోరాట స్ఫూర్తితో ఇప్పుడూ ముందుకెళ దామని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా ఈనెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని.. ఆ వేదిక సాక్షిగా రేవంత్ సర్కారు వైఖరి ఎండగట్టాలని గులాబీ పార్టీ నిర్ణయించింది.

       వాస్తవానికి కారు పార్టీ అధినేత ఇలా సమర శంఖం మోగించాలని నిర్ణయించడం వెనుక పెద్ద కారణమే ఉందన్న వాదన విన్పిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజ యకేతనం ఎగురవేసింది. అయితే.. ఇటీవలె జరిగిన 2023 ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని భావించినా.. వివిధ రకాల కారణాలతో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. అయితే.. అధికారం కోల్పోయిన కొద్ది రోజులకే.. ఇంట్లో కాలు జారి పడిపో యిన కేసీఆర్‌ అస్వస్థతకు గురయ్యారు. తిరిగి ఇటీవలె కోలుకున్నారు. కొన్ని రోజుల క్రితమే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకా రం చేసిన ఆయన.. ప్రజల్లోకి వెళ్లే అంశంపై సహచరులతో మాట్లాడుతున్నారు. ఏదైనా గట్టి అంశం తీసుకొని ప్రజల్లోకి వెళ్లడం ద్వారా.. ప్రజలకు పార్టీపై మరింతగా భరోసా కల్పించడంతోపాటు లోక్‌సభ ఎన్నికలకు సమర శంఖం మోగిం చినట్లు అవుతుందన్న భావనతో ఉన్నారు. సరిగ్గా ఇలాంటి వేళ…కేసీఆర్‌కు…కేఆర్‌ఎంబీ సమస్య కన్పించింది. రాష్ట్ర ప్రయోజనాలు కలిసి ఉన్న ఇష్యూ కావడంతో ఎవరూ అభ్యంతరం చెప్పేందుకు వీలులేని రీతిలో తమ వాణిని బలంగా విన్పించాలని భావిస్తున్నారు కేసీఆర్. మరి…ఎన్నికల వేళ బీఆర్ఎస్ వ్యూహం ఎంత మేరకు కలిసి వస్తుంది..? పార్లమెంటు ఎన్నికల్లో ఏ మేరకు మైలేజ్ ఇస్తుందో చూడాలి మరి.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్