హైదరాబాద్ తో తెలంగాణ రాష్ట్ర మొత్తం అభివృద్ధి చెందేలా ప్లాన్ చేశామమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ముప్పై ఏళ్లుగా చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలు కు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలును తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందన్నారు. అగ్నిమాపక విభాగం యొక్క అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఫైర్ డిపార్ట్ మెంట్ అనేది కేవలం అగ్ని ప్రమాదాలు కోసమే కాదు, విపత్తకర పరిస్థితుల్లో కూడా వీరు సేవలు అందిస్తూ ఉంటారని సీఎం తెలిపారు. అర్బన్, రూరల్ తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డును త్వరలో తీసుకోస్తామన్నారు. రింగ్ రోడ్డు చుట్టూ ట్రైన్ సదుపాయం కూడా తీసుకురాబోతున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు.


