Free Porn
xbporn
22.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

వరంగల్ జిల్లాలో పార్లమెంట్ పోరు

         తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల వేడి మెల్లగా ఊపందుకుంటోంది. మరో మూడు నెలల్లోగా సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రావచ్చన్న ప్రచారం జోరుగా సాగుతుండడంతో పలువురు నేతలు ఎంపీ సీట్లపై దృష్టి సారించా రు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు ఎంపీ స్థానాలున్నాయి. ఒకటి వరంగల్ కాగా, మరోటి మహబూబాబాద్‌. ఇందు లో వరంగల్ ఎస్సీ రిజర్వేషన్‌ కాగా, మహబూబాబాద్‌ ఎస్టీ రిజర్వ్‌డ్‌ సీటు.

           ఇందులో వరంగల్ విషయానికి వస్తే… ఈ పార్లమెంటు నియోజకవర్గంలో 2009 పునర్విభజన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య విజయం సాధించారు. 2014లో బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి ఎన్నికయ్యారు. అనంతరం 2015లో కడియం రాజీనామాతో జరిగిన బై ఎలక్షన్లలో బీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఘనవిజ యం సాధించారు. ప్రస్తుతం విషయానికి వస్తే వరంగల్ ఎంపీ సీటుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌తోపాటు వర్థన్నపేట నుంచి పోటీ చేసి ఓటమిపాలైన ఆరూరి రమేష్, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రధానంగా పోటీ పడుతున్నారు. వీరితోపాటు అడ్వకేట్ గుడిమల్ల రవి కుమార్, మాజీ కార్పొరే టర్ జోరిక రమేష్ సైతం బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక, కాంగ్రెస్ నుంచి ఈ పోటీ మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న జోష్‌లో ఉన్న ఆ పార్టీ నేతలు సీటు మాకంటే మాకు ఇవ్వాలంటూ ముందుకొస్తున్నారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతోపాటు దొమ్మాటి సాంబయ్య, నమిండ్ల శ్రీనివాస్ ప్రధాన పోటీదారు లుగాకన్పిస్తున్నారు. అయితే.. హైకమాండ్ ఆశీస్సులు తనకే ఉంటాయని చెబుతున్నారు సిరిసిల్ల రాజయ్య.

       బీజేపీ నుంచి సైతం పలువురు.. వరంగల్ ఎంపీ సీటుకు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో సరైన అభ్యర్థి దొరక్క పోవడంతో పొరుగు జిల్లా నుంచి చింతా సాంబమూర్తిని తీసుకొచ్చి నిలబెట్టారు. కానీ, ఈసారి మాత్రం మందకృష్ణ మాదిగ పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. మందకృష్ణ మాదిగ ఈ మధ్య కాలంలో ప్రధాని మోడీకి సన్నిహతంగా మెలుగు తున్నారు. అలాగే.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఇప్పటికే అత్యంత సన్నిహితుడు. దీంతో.. వరంగల్ ఎంపీ సీటు కమలం తరఫున మందకృష్ణ మాదిగకు కన్ఫామ్ అనే మాట విన్పిస్తోంది. అలాగే…మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ సైతం టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరితోపాటు మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ పేరు సైతం వరంగల్ ఎంపీ సీటుకు వినిపిస్తోంది. చివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తరఫున ఎవరెవరు బరిలో దిగుతారన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్