చండీగడ్లో రైతు సంఘాలతో కేంద్ర మంత్రుల చర్చలు ముగిశాయి. సానుకూల చర్చలు జరిగాయని మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. కేంద్రం ప్రతిపాదనలపై సమయం కావాలని రైతు సంఘాలు కోరాయి. రేపటి లోగా నిర్ణయం ప్రకటిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. అప్పటివరకు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపాయి.డిమాండ్ల సాధనకై ఢిల్లీ ఛలో పేరిట ఆందోళన చేప ట్టిన రైతులతో కేంద్రం జరిపిన నాలుగో విడత చర్చలు జరిపింది. నిన్న సాయంత్రం 8 గంటల 15 నిమిషా లకు ప్రారంభమైన ఈ భేటీ తెల్లవారుజామున ఒంటి గంట వరకు కొనసాగింది. ప్రభుత్వం తరఫున వ్యవ సాయశాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యా నంద్ రాయ్ రైతు నేతలతో చర్చలు జరిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని తమ బృందం ప్రతిపాదిం చినట్లు పీయుష్ గోయల్ చెప్పారు. కందులు, మినుములు, మైసూర్ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో NCCF, NAFED వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయని తెలిపారు. కొనుగోలు చేసే పరిమాణంపై ఎటువంటి పరిమితి ఉండదని అన్నారు. దీని కోసం ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. తమ ప్రతిపాదనల వల్ల పంజాబ్లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుందని తెలిపారు. భూగర్భ జలమట్టాలు మెరుగవుతాయన్నారు. సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయని చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై రైతు నేత శర్వాన్ సింగ్ పంథేర్ స్పందించారు. దీనిపై ఇవాళ, రేపు తమ సంఘాలతో చర్చిస్తామన్నారు. నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక నిర్ణయా నికి వస్తామని తెలిపారు. రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. దీనిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి ఢిల్లీ చలో కార్యక్రమాన్ని నిలిపివేశామని.. ఒకవేళ తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి 21న తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.


