ఆఫ్రికా దేశం జాంబియాను కలరా వ్యాధి కలవరపెడుతోంది. వేల మంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. వందల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి 600 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 వేల మందికి పైగా ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఆ దేశంలోని మొత్తం పది ప్రావిన్సుల్లో తొమ్మిదింటిలో ఈ వ్యాధి వ్యాపించ డం అక్కడి దుర్భర పరిస్థితికి అద్దం పడుతోంది. స్టేడియాల వద్ద ప్రభుత్వం తాత్కాలిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మాస్ వ్యాక్సినేషన్ను ప్రారంభించింది. ప్రభావిత ప్రాంతాలకు శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తోంది. పరిస్థితు లు దిగజారడంతో విశ్రాంత వైద్య సిబ్బంది సేవలను కూడా తీసుకుంటోంది. ఈ సమయంలో పడుతున్న భారీ వర్షా లు.. వైద్య సేవలకు, సురక్షిత నీటి సరఫరాకు ఆటంకం కలిగిస్తున్నాయి. మామూలుగా కలరాతో మరణాల రేటు ఒకశాతం కంటే తక్కువగా ఉంటుంది. కానీ జాంబియాలో ఆ పరిస్థితి భిన్నంగా ఉంది. ఆ రేటు నాలుగు శాతం కంటే ఎక్కువగా ఉండటం కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్ ఆపన్న హస్తం అందించింది. ఆ దేశానికి క్లోరిన్ మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీటి శుద్ధి యంత్రాలతో కూడిన 3.5 టన్నుల మానవతా సాయాన్ని పంపించిందని అధికారులు తెలిపారు.