విజయవాడలో చంద్రబాబు పోటీ చేసినా… తానే 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు కేశినేని నాని. నందిగామ నియోజకవర్గం వైసీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్ చేశారు. దేవినేని ఉమా ఇసుక తవ్వకాలు భారీగా జరిపి దోచుకున్నాడని ఆరోపించారు. సామాజిక వర్గాలను రెచ్చగొట్టే నైజం దేవినేని ఉమాది అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించిన కేశినేని.. బినామీ పేర్లతో స్థలాలను కొనుగోలు చేసి… 29 వేల మంది రైతులు మోసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కోట్లు గడించారని ఆరోపించారు. తనపై చంద్రబాబు పోటీకి నిలబడాలని ఆహ్వానించిన కేశినేని ఎవరు గెలుస్తారో చూద్దాం అన్నారు.