YS Viveka Murder Case | ఏపీలో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన సూత్రదారి ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. వచ్చే నెల 5లోగో హైదరాబాద్ సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. సీబీఐ కోర్టులో గంగిరెడ్డి లొంగిపోకపోతే.. పోలీసులు గంగిరెడ్డిని అరెస్టు చేయవచ్చని హైకోర్టు తెలిపింది.