22.5 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

వివేకా హత్య కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. మంగళవారం వివేకా పీఏ కృష్ణారెడ్డిని విచారించిన సీబీఐ ఇవాళ వంటమనిషి లక్ష్మీదేవి కుమారుడు ప్రకాశ్‌ను విచారించింది. వివేకా హత్య జరిగిన రోజు లేఖ దాచిపెట్టడంపై అధికారులు పీఏ కృష్ణారెడ్డితో కలిపి ప్రకాశ్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. లేఖను కృష్ణారెడ్డి ద్వారా ప్రకాశ్ రెడ్డి దాచిపెట్టాడనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ కూపీ లాగే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఇప్పటికే వివేకా కూతురు సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలను విచారించిన అధికారులు వారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనయ్ తుల్లా, ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్ రెడ్డి‌లను కూడా సీబీఐ మరోసారి ప్రశ్నించింది.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్